అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య

31 Oct, 2015 10:58 IST|Sakshi

పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్‌లో ఓ కౌలు రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మదరమోని మల్లేశ్ ముదిరాజ్ (48)కు ఒక ఎకరం పొలం ఉంది. మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, సాగు, కుమార్తె వివాహం కోసం ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. కుమార్తె వివాహం అయిన ఏడాదికే అల్లుడు మృతి చెందాడు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అప్పుల విషయమై మనస్తాపం చెందిన మల్లేశ్ శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పురుగుల మందు తాగినట్టు కుమార్తెకు చెప్పడంతో హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
 

మరిన్ని వార్తలు