ఖమ్మం జిల్లాలో పోడురైతుల ఆందోళన

4 May, 2015 13:54 IST|Sakshi

కారేపల్లి (ఖమ్మం జిల్లా): అటవీ అధికారులు పోడు రైతులపై జరుపుతున్న దాడులను వ్యతిరేకిస్తూ సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ కార్యాలయ ముట్టడికి సోమవారం ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  కార్యాలయ ముట్టడికి ప్రయత్నించి సుమారు 500 మందిని అడ్డుకున్నారు. పోడు భూముల్లో గిరిజనులకు వ్యవసాయం చేసుకొనే హక్కు కల్పించాలని పోడు రైతులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోడు రైతులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని అటవీ అధికారులను కోరారు.

>
మరిన్ని వార్తలు