బ్యాంకుల ఎదుట రైతుల ఆందోళన

25 Jul, 2015 18:01 IST|Sakshi

మహబూబ్‌నగర్ (జడ్చర్ల) : బ్యాంకర్లు పంట బీమా డీడీలను స్వీకరించటంలేదని జడ్చర్లలోని పలు గ్రామాల రైతులు శనివారం బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

లోన్ రెన్యువల్ చేసుకున్న రైతుల డీడీ మాత్రమే తీసుకోవాలని పైనుంచి ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ విషయంలో మేమేమీ చేయలేమని బ్యాంకు అధికారులు పేర్కొనడంతో చేసేదేమీ లేక ఆందోళన విరమించారు.
 

>
మరిన్ని వార్తలు