ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

18 Sep, 2015 18:48 IST|Sakshi
ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు

నిజామాబాద్(కామారెడ్డి): కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయాన్ని పలువురు రైతులు శుక్రవారం ముట్టడించారు. బెల్లం క్వింటాకు రూ.2800 చొప్పున ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలు చేతబట్టుకుని అధికారులను హెచ్చరించారు.

మరిన్ని వార్తలు