రైతులు అధైర్యపడొద్దు

9 Sep, 2015 13:50 IST|Sakshi

మిర్యాలగూడ : రైతులు అధైర్యపడరాదని, కేసీఆర్ నాయకత్వంలోని సర్కార్ అన్నదాతకు అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ నేతి విద్యాసాగరరావు రైతులకు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. రైతులు ఎలాంటి అఘాయిత్యాలు పాల్పడవద్దన్నారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియాను పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు