గోడ కూలి తండ్రీకూతురు మృతి

23 Jun, 2015 16:04 IST|Sakshi

ములుగు: మెదక్ జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి తండ్రీకూతురుపై పడింది. ఈ సంఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. గత వారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల సమీపంలో కూడా ఇదే రీతిన గోడ కూలి ఒకే ఇంట్లోని నలుగురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు