హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఈటల

12 Jan, 2016 15:54 IST|Sakshi

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలంలో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ హైలెవెల్ బ్రిడ్జిని జేగురుపల్లి, నీరుకొల్లు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్నారు. దీనికి ప్రభుత్వం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్‌తోపాటు పలువురు శాసనసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు