కిరాణాషాపు దగ్ధం: రూ.3 లక్షలు నష్టం

24 Aug, 2015 18:27 IST|Sakshi

మెదక్ రూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ కిరాణా షాపు దగ్ధమై రూ.3 లక్షల నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని పాతూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... పాతూరు గ్రామానికి చెందిన పొగాకు అశోక్ గత కొంతకాలంగా గ్రామంలో కిరాణా షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా సోమవారం వేకువజామున ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్రిడ్జ్, కూలర్‌తోపాటు నగదు, రూ. 5వేలు సైతం కాలి బూడిదైనట్లు బాధితుడు అశోక్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వాపోయాడు. తనను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు