సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మాసబ్ట్యాంక్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదాయపన్ను శాఖ బిల్డింగ్ ఎనిమిదవ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.