ఎఫ్‌సీఐ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

8 Dec, 2018 17:16 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజాపేటలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాం పూర్తిగా దగ్ధమైపోయింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే 2 గంటలు శ్రమించినప్పటికి ఫలితం దక్కలేదు. గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆ చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు