టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బస్సులో మంటలు!

27 Apr, 2017 19:55 IST|Sakshi

తృటిలో తప్పిన ముప్పు
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది


యాదాద్రి‌: ఓరుగల్లులో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు బస్సులో వెళుతున్న పార్టీ కార్యకర్తలకు పెనుముప్పు తప్పింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ప్రయాణిస్తున్న బస్సు క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భువనగిరి బైపాస్‌ వద్ద ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌తోపాటు, బస్సులోని వారు మంటలను చూడటంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు