జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

17 May, 2018 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8, 9వ తేదీల్లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని.. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని హరినాథ్ గౌడ్ వివరించారు. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న పన్నిలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్, గౌడ వసతి గృహం వలంటీర్లకు హరినాథ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు