పాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదల

13 Sep, 2017 13:39 IST|Sakshi
ఖమ్మం : మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ బుధవారం ఉదయం పాలేరు జలాశయంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 70 కోట్ల చేపపిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
 
అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ వర్తింపచేస్తామన్నారు. ప్రతి గొర్రె పిల్లకు బీమా సదుపాయం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గొర్రెల పంపిణీని విమర్శించడం విడ్డూరమని కోపోద్రిక్తులయ్యారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంచార వైద్యశాలలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని తెలిపారు.
మరిన్ని వార్తలు