నిజామాబాద్ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతోంది. బుధవారం నాటికి ప్రాజెక్టులోకి 30,664 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1071.9 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటినిల్వ 32.9 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు.