చెట్టు కోడితే ‘వాల్టా’ వాతలు పెట్టుద్ది!

29 Feb, 2020 02:59 IST|Sakshi

చెట్టు కొట్టినందుకు రూ.53,900 జరిమానా

80 మొక్కలు నాటాలని అటవీ శాఖ షరతు 

సాక్షి,హైదరాబాద్‌: నగరంలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో అనుమతి లేకుండా 40 చెట్లను కొట్టివేసినందుకు వాల్టా చట్టం అతిక్రమణ కింద ఓ సంస్థకు అటవీ శాఖ రూ.53,900 జరిమానా విధించింది. దీంతోపాటుగా కొట్టిన చెట్లకు బదులుగా 80 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని షరతు విధించింది. కూకట్‌పల్లిలోని ఇందు ఫార్చూన్‌ ఫీల్డ్‌లో సంబంధిత శాఖల అనుమతి లేకుండా దాదాపు 40 చెట్లు కొట్టివేయడంపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కమ్యూనిటీలో అదనపు సౌకర్యాల కల్పన కోసం చెట్లు కూల్చాల్సి వచ్చిందని, కొట్టేసిన చెట్లను ట్రాన్స్‌లొకేట్‌ చేశామని ఇందు ఫార్చూన్‌ ఇచ్చిన వివరణతో అటవీశాఖ అధికారులు సంతృప్తిచెందలేదు. ఈ చెట్ల నరికివేతకు సంబంధించి మేడ్చల్‌ జిల్లా అటవీ అధికారి సుధాకర్‌ రెడ్డి, సిబ్బంది పరిశీలించి చెట్ల నరికివేత, మరోచోట వాటిని పెట్టడం శాస్త్రీయంగా జరగలేదని నిర్థారించారు.   

మరిన్ని వార్తలు