విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

19 Dec, 2014 15:48 IST|Sakshi

హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.  ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా కోర్టులోవాదోపవాదాలు పూర్తయిన అనంతరం విష్ణు వర్ధన్ కు బెయిల్ లభించింది. ఈ రోజు ఉదయం విష్ణు బెయిల్ కు సంబంధించి వాదనలు జరిగినా.. న్యాయమూర్తి తన నిర్ణయాన్నిమధ్యాహ్నానికి వాయిదా వేశారు. 

 

కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ను అడ్డుకునే యత్నం చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణుకు బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు