మంచి పనులకు అండగా ఉంటాం : మాజీ ఎంపీ కవిత

31 Jul, 2019 15:41 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌‌: ఇందూరు యువత కార్యక్రమాలు దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మాజీ ఎంపీ కవిత. విలేకరులతో మాట్లాడుతూ.. ఇందూరు యువత చేస్తోన్న మంచి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. యువత చేస్తోన్న కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామన్నారు. ఎంతో మంది అనాథలను మంచి మనసుతో చేరదీస్తున్నారని ప్రశంసించారు. యువత చదువుతో పాటు సమాజ సేవలో కూడా పాల్గొనాలని ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు