అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య

22 Aug, 2014 03:39 IST|Sakshi

న్యూస్‌నెట్‌వర్క్: వర్షాభావం, కరెంటు కోతలు, అప్పుల భారం ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో నలుగురు రైతులను ఆత్మహత్యకు పురిగొల్పాయి. వివరాలివీ...ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరెగూడేనికి చెందిన తమ్మినేని వెంకటేశ్వరరావు(40), మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటకు చెందిన జుర్రు మల్లయ్య (40),వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పీచర గ్రామానికి చెందిన మహిళా రైతు ఆవుల రమ(33), చిట్యాల మండలం సుబ్బక్కపల్లికి చెందిన నల్ల సమ్మయ్య(50) పురుగు మందు తాగి తనువు చాలించారు.

మరిన్ని వార్తలు