నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

28 Mar, 2017 07:47 IST|Sakshi

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అనంతశర్మ సస్పెండ్‌ చేశారు. తెరాస కార్యకర్త సల్మాన్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి మొద్దు కు కట్టేసిన విషయంలో హెడ్‌కానిస్టేబుల్‌ గోపాల్ రెడ్డితోపాటు కానిస్టేబుల్ బాలకృష్ణ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అదేవిధంగా హోలీ సందర్భంగా రాయికల్ లో డబ్బులు వసూలు చేసిన సంఘటనలో కానిస్టేబుళ్లు అంజయ్య, వేణులను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఆదేశాలిచ్చారు.

>
మరిన్ని వార్తలు