ఎంజీబీఎస్‌లో 5 జీ వైఫై సేవలు..

14 Sep, 2015 14:40 IST|Sakshi

అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్) : మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 5 జీ వైఫై సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ జేఎండీ రమణారావు వీటిని ప్రారంభించారు. 15 నిముషాలపాటు ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం చార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాల్లోని బస్ట్‌స్టేషన్లలో కూడా త్వరలోనే వైఫై సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు