ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభం

5 Mar, 2018 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైబరాబాద్ పరిధిలో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ బస్సు సర్వీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత సైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్ల ఆయన తెలిపారు.

మూడు మార్గాల్లో ఈ సైబర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణ కోసం ఈ బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు