'మానసిక వికలాంగుడిలా మధుయాష్కీ వ్యవహారం'

16 Aug, 2014 13:47 IST|Sakshi
'మానసిక వికలాంగుడిలా మధుయాష్కీ వ్యవహారం'

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. శనివారం గంగుల కమలాకర్ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి మధుయాష్కీకి లేదని అన్నారు. కేసీఆర్ను తుగ్లక్ అనే దమ్ము, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయని మధును కమలాకర్ ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.  ఆ పథకాలపై కూడా మధుయాష్కీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఓడిపోయి మధుయాష్కీ మానసికంగా కుంగిపోయినట్లు ఉన్నారని...  అందుకే ఆయన మానసిక వికలాంగుడిలా వ్యవహరిస్తున్నారని కమలాకర్ ఎద్దేవా చేశారు.  
 

మరిన్ని వార్తలు