సాక్షి, హైదరాబాద్: గంజాయి అంతరాష్ట్ర రవాణా ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని సరఫరా చేస్తున్నఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు రాపురోహిత్, ప్రేమ్కుమార్ను ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, ఒక కారు, రూ.12,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్నగర్ పోలీసులకు అప్పగించారు. కాగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.