గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు; నలుగురికి గాయాలు

1 Mar, 2020 07:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మలక్‌పేటలోని వెంకటాద్రినగర్‌లో ఒక ఇంట్లో ఆదివారం అర్థరాత్రి సిలిండర్‌ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. కాగా సిలిండర్‌ పేలుడు దాటికి ఇళ్లుతో పాటు పలు వాహనాలు దగ్దమయ్యాయి. సిలిండర్‌ పేలి ఒక్కసారిగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు