రహదారులకు  800 కోట్లు ఇవ్వండి 

26 Jan, 2018 02:21 IST|Sakshi

కేంద్రమంత్రి తోమర్‌కు జూపల్లి విజ్ఞప్తి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 535 హ్యా బిటేషన్ల పరిధిలో 1,230 కి.మీ. రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణసడక్‌ యోజన కింద రూ.800 కోట్లు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణా భివృద్ధి మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.  

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో తోమర్‌ను గురువారం కలిశారు. పంచాయతీల మాదిరిగా మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు మంజూరు చేయాలన్నారు.   

మరిన్ని వార్తలు