గోకుల్‌చాట్ ఘటనకు ఎనిమిదేళ్లు

25 Aug, 2015 18:42 IST|Sakshi

అబిడ్స్ (హైదరాబాద్) : గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో జంట బాంబు పేలుళ్లు సంభవించి నేటికి ఎనిమిదేళ్లయ్యాయి. భాగ్యనగరం గుండెపై ఓ మానని గాయంలాంటి ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఈరోజు బీజేపీ కార్యకర్తల ఆధ్యర్యంలో నాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

ఈ సందర్భంగా 'ఉగ్రవాదం నశించాలి' అనే నినాదంతో  బ్యానర్‌లను ఏర్పాటు చేశారు. భారతమాత విగ్రహానికి పూలమాల వేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు