1.3 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం

15 Jun, 2015 16:55 IST|Sakshi

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల లగేజీని తనిఖీ చేయగా... అందులో 1.3 కేజీల బంగారు బిస్కెట్లు వెలుగు చూశాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని పుణేకు చెందిన వారిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు