సలహాదారుల పదవీకాలం ఏడాది పొడిగింపు

27 May, 2015 19:54 IST|Sakshi

హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్.విద్యాసాగర్‌రావు (నీటిపారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన), ఏ.రామలక్ష్మణ్ (సంక్షేమం), బి.వి.పాపారావు (విధాన నిర్ణయాలు, సంస్థాగత అభివృద్ధి), కేవీ రమణాచారి (సాంస్కృతిక పర్యాటక, యువజన, మీడియా విభాగాలు), జీఆర్‌రెడ్డి (ఆర్థిక శాఖ) సలహాదారులుగా ఉన్నారు. ఈ ఆరుగురు సలహాదారులు మరో ఏడాది పాటు ఈ పదవిలోనే కొనసాగుతారు.

>
మరిన్ని వార్తలు