గవర్నర్‌ జాయింట్ సెక్రటరీకి గాయాలు

4 Jun, 2014 20:24 IST|Sakshi

నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గవర్నర్‌ నరసింహన్‌ జాయింట్ సెక్రటరీ బసంత్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైయ్యింది. కుటుంబసభ్యులతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు టైర్‌ పగిలి కారు బోల్తా పడింది.  ఈ ఘటనలో బసంత్‌ కుమార్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనేసమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని వార్తలు