సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మరోసారి గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ఈఎన్టీ వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమవారం గాంధీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గాంధీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం గవర్నర్ ఐసీయూను సందర్శించి, అక్కడ రోగులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కాగా గత ఏడాదిలో కూడా గాంధీకి వచ్చిన నరసింహన్ కాలికి ఆనె(కార్న్)తో రావడంతో ఆపరేషన్ చేయించుకున్నారు.