సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారన్నారు. ఆధునిక కాలపు చెడులను జయించడానికి, శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యం ప్రబలంగా ఉన్న సమాజ నిర్మాణానికి ఇలాంటి పండుగలు స్ఫూర్తినిస్తాయని తన సందేశంలో గవర్నర్ తెలిపారు.