అక్టోబర్ 6న వీసీలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పటిష్టతపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టి సారించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించిన తరువాత తొలిసారిగా వీసీలతో అక్టోబర్ 6న సమావేశం కానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ సమావేశం జరగనుంది. ఇటీవల ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులతో భేటీ అయిన గవర్నర్.. వర్సిటీ చాన్స్లర్ హోదాలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశంలో యూనివర్సిటీల పటిష్టత, నాణ్యతా ప్రమాణాల పెంపు అంశాలపైనే ప్రధాన దృష్టి సారించ నున్నారు. వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.