అక్రమ బంగారం పట్టివేత

9 Sep, 2017 03:04 IST|Sakshi
అక్రమ బంగారం పట్టివేత

ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌  
హైదరాబాద్‌:
అక్రమంగా 4.5 కేజీల బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ జీఆర్‌పీ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు.

గురువారం సాయంత్రం 6 గంటలకు అమృత్‌సర్‌కు చెందిన ఖన్నా రాజేశ్, జగ్‌మోహన్‌సింగ్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాజేశ్, సింగ్‌ కదలికలపై అనుమానం వచ్చిన జీఆర్‌పీ పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా సుమారు 4.532 కేజీల బంగారు ఆభరణాలు కనిపించాయి. బంగారానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి బిల్లులు లభించకపోవటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు