రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

25 Jan, 2019 07:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్టానికి సంబంధించి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. మొత్తంగా రెండో దశలో 4135 సర్పంచ్‌ స్థానాలకు 783 ఏకగ్రీవమయ్యాయి.  మిగిలిన 3,342 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 10,668 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 26, 191 వార్డులకు 63,480 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగగా..రెండు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 

మరిన్ని వార్తలు