మాచారెడ్డి నిజామాబాద్ : గ్రామపంచాయతీ సిబ్బంది నా లుగో రోజు సమ్మెలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ కారోబార్లు, వాటర్మెన్లు, సపాయి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారోబార్ల సంఘం మండలాధ్యక్షుడు బట్ట రమేశ్ మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమిం చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కారోబార్ల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్నర్సు, ప్రతినిధులు సురేష్, దశరథ్రెడ్డి, రవి, నర్సింలు, రాజు పాల్గొన్నారు.