గ్రామపంచాయతీ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన

27 Jul, 2018 14:58 IST|Sakshi
 మాచారెడ్డిలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్న కార్మికులు 

మాచారెడ్డి నిజామాబాద్‌ : గ్రామపంచాయతీ సిబ్బంది నా లుగో రోజు సమ్మెలో భాగంగా గురువారం గ్రామ పంచాయతీ కారోబార్లు, వాటర్‌మెన్‌లు, సపాయి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కారోబార్ల సంఘం మండలాధ్యక్షుడు బట్ట రమేశ్‌ మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమిం చేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కారోబార్ల సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌నర్సు, ప్రతినిధులు సురేష్, దశరథ్‌రెడ్డి, రవి, నర్సింలు, రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు