ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ

2 Mar, 2015 18:19 IST|Sakshi
ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ

వరంగల్ : ఇసుక క్వారీల ఏర్పాటుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం జరిగింది. మండలంలోని ఏటూరు, సింగారం, కంతలపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ఏటూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇసుకు క్వారీ ఏర్పాటుకోసం గ్రామసభను ఏర్పాటు చేశారు. కాగా, ఈ సోసైటీని రహస్యంగా ఏర్పాటు చేశారని ఆయా గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చెలరేగింది.
(ఏటూరునాగారం)

మరిన్ని వార్తలు