గ్రానైట్ కార్మికుడి బలవన్మరణం

1 Sep, 2015 16:34 IST|Sakshi

ముదిగొండ (ఖమ్మం): ఓ గ్రానైట్ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం, ఖానాపురం గ్రామానికి చెందిన ఇమ్మడి రాము (29) కొన్నేళ్లుగా అదే మండలంలోని ఖానాపురంలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే మంగళవారం గ్రామంలోని మామిడి తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు