గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై వేటు

10 Jul, 2015 18:50 IST|Sakshi

మారేడుపల్లి (హైదరాబాద్) : హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై వేటుపడింది. కొన్ని రోజుల క్రితం ఈ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 67 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రిన్సిపాల్ వై.సత్యనారాయణను శుక్రవారం ఆ బాధ్యతల నుంచి తప్పించారు. సత్యనారాయణ గత సంవత్సరం నుంచి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు