ఎంపీ సోదరుడి భార్య ఆత్మహత్య

21 Sep, 2017 12:28 IST|Sakshi
ఎంపీ సోదరుడి భార్య ఆత్మహత్య

చిట్యాల:
నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి సోదరుడి భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా మహేందర్‌ రెడ్డి భార్య శ్రీలత(45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

శ్రీలత భర్త గుత్తా మహేందర్‌ రెడ్డి గ్రామంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ నడిపిస్తున్నారు. కాగా.. అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు