నెలాఖరులోగా ఆ ప్రాజెక్టుల నివేదికలివ్వండి

16 Feb, 2017 03:23 IST|Sakshi
నెలాఖరులోగా ఆ ప్రాజెక్టుల నివేదికలివ్వండి

వ్యాప్కోస్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెలాఖరులోగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని వ్యాప్కోస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దేవాదుల, నార్లాపూర్, డిండి, కాంతానపల్లి, మల్కాపూర్‌ రిజర్వాయర్, తుమ్మిడిహెట్టి, మల్లన్నసాగర్‌ నుంచి సింగూర్‌ లింక్‌ తదితర సర్వే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి డీపీఆర్లు సమర్పించాలని తెలిపారు. వ్యాప్కోస్‌ త్వరితగతిన నివేదికలు సమర్పించేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయా ప్రాజెక్టులు, ప్యాకేజీలకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి వ్యాప్కోస్‌ అధికారులు, సీఈలతో మంత్రి హరీశ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

మరిన్ని వార్తలు