-

మున్సిప‌ల్ కార్మికుల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం

28 Mar, 2020 13:12 IST|Sakshi
పారిశుద్ధ్య  కార్మికుల‌కు మాస్క్‌లు, గ్లౌజులు అంద‌జేస్తున్న హరీష్‌రావు

సాక్షి, సిద్ధిపేట : మున్సిప‌ల్ కార్మికుల‌పై ఆర్థిక మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు.. పొన్నాల నుంచి వ‌స్తుండ‌గా మాస్క్‌లు లేకుండా విధులు నిర్వ‌ర్తిస్తున్న మున్సిప‌ల్ కార్మికుల‌ను గ‌మ‌నించారు. దీంతో అక్క‌డే ఆగి.. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న క్ర‌మంలో జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని సిబ్బందిని ఆయన ప్ర‌శ్నించారు. స్థానిక మున్సిప‌ల్ కమిష‌న‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం మంత్రి స్వ‌యంగా పారిశుద్ధ్య  కార్మికుల‌కు మాస్క్‌లు, గ్లౌజులు అంద‌జేశారు. (మందు బాబులను ఆగమాగం చేస్తోంది..)
చదవండి: కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు

మరిన్ని వార్తలు