'ప్రతిపక్షాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి'

4 Feb, 2015 20:14 IST|Sakshi
'ప్రతిపక్షాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి'

హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలన్నీ ఆశ్చర్యపోతున్నాయని భారీ నీటి పారదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. అందుకే కేసీఆర్పై ప్రతిపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్, టీడీపీ పాలనలో అప్పనంగా ప్రజల ఆస్తులను దొంగలపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వంలోని ముఖ్య శాఖలన్నీ ఒకే చోట చేర్చేందుకే కేసీఆర్ నూతన సెక్రటేరియట్ను నిర్మించాలని తలపెట్టారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

మరిన్ని వార్తలు