పండుటాకుల పరేషాన్‌..!

29 Dec, 2016 04:28 IST|Sakshi
పండుటాకుల పరేషాన్‌..!

మిర్యాలగూడలో తోపులాట.. 12 మంది ఆసరా లబ్ధిదారులకు గాయాలు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు పోస్టాఫీసు వద్ద బుధవారం ఆసరా పింఛన్లకు క్యూలైన్‌లో నిలబడిన వృద్ధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు  400 మందికి పైగా వృద్ధులు  క్యూలో నిల్చున్నారు.

కాగా, ఈ క్యూలైన్‌లో తోపులాట చోటుచేసుకుని కిందపడ్డారు.దీంతో నాగమ్మ, కాశమ్మ, పద్మ, లింగమ్మ, నర్సమ్మ, సజ్జల అచ్చమ్మ, శ్రీదేవి, రంగమ్మ, ఫాతిమ, జానమ్మ, సరోజ, రాములమ్మ అనే 12 మంది వృద్ధులకు గాయాలయ్యాయి. కాగా, ఈ తోపులాట విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ కిషన్‌రావు పోస్టాఫీసును సందర్శించి క్యూలో నిలబడిన వారితో మాట్లాడారు. క్యూలో నిలబడిన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేయాలని పోస్టల్‌ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు