రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

10 Apr, 2017 13:32 IST|Sakshi
వర్ని: బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన నిజాబాబాద్ జిల్లా వర్ని చౌరస్తా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ బైక్ పై పని నిమిత్తం బయటకు వెళ్లగా, వర్నీ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు