విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు

29 Aug, 2015 17:20 IST|Sakshi

మహాముత్తారం (కరీంనగర్): హోం వర్క్ చేయలేదనే నెపంతో పదో తరగతి విద్యార్థినిని ప్రధానోపాధ్యాయురాలు చితకబాదింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో శనివారం జరిగింది. వివరాలు.. పదోతరగతి చదువుతున్న సమ్మక్క (15) హోం వర్క్ చేయలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టింది.

దీంతో విద్యార్థిని రెండు రోజుల నుంచి హాస్టల్ గదికే పరిమితమైంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వచ్చిన బాలిక కుంటుంతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలని వివరన కోరారు.

మరిన్ని వార్తలు