రేపటి నుంచి మూడ్రోజులు భారీ వర్షాలు

7 Jun, 2017 07:03 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 8 నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జార్ఖండ్‌ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని, దీనివల్ల క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిం చింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. భువనగిరి, శంషాబాద్, గాండీడ్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. చేవెళ్ల, మహేశ్వరం, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 
మరిన్ని వార్తలు