బాసరలో పెరిగిన భక్తులు

18 Jul, 2015 08:29 IST|Sakshi

ఆదిలాబాద్(బాసర): ఆదిలాబాద్ జిల్లా బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు కావడంతో పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకువ జామునే పెద్ద సంఖ్యలో బాసరకు చేరుకున్న భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించారు. భారీ రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు