కాళేశ్వరం.. భక్త జనసంద్రం

18 Jul, 2015 14:05 IST|Sakshi

కాళేశ్వరం: కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రానికి గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రంజాన్ సెలవు దినం కూడా కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం 4 లక్షల మంది పుణ్య స్నానం చేయగా... శనివారం మధ్యాహ్నానికే ఈ సంఖ్య దాటిపోయింది. సుమారు 4 లక్షల మందికి పైగా స్నానాలు ఆచరించి కాళేశ్వర, ముక్తేశ్వరుణ్ణి దర్శించుకున్నారు.

కాగా, భక్తులు ఎక్కువ మంది ప్రత్యేక వాహనాల్లో రావడంతో కాటారం నుంచి కాళేశ్వరం మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. సాధారణంగా కాటారం నుంచి కాళేశ్వరం మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ వాహనాల రద్దీతో శనివారం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు