సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో 128 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక కూడా కొంతమంది అభ్యర్థులను పక్కనపెట్టడంపై... అక్రమాలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఇచ్చిన స్టేను హైకోర్టు ఇవాళ ఎత్తివేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.