మహిపాల్‌ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు నో

8 Jan, 2016 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  మెదక్ జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(టీఆర్‌ఎస్)కి జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న బీజేపీ నేత రఘునందన్‌రావు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి బలవంతంగా రూ.15 లక్షల చెక్కు రాయించుకున్న కేసులో మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, జరి మానా విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును లోతుగా విచారించాల్సిఉందని, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు